News August 25, 2024
విశాఖ: ‘డిజైన్ లోపంతోనే భారీ ప్రమాదం’

అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్ నిర్వహణతో పాటు డిజైన్లో లోపాలే పెద్ద ప్రమాదానికి కారణమని రాష్ట్ర విపత్తుల నిర్వహణ అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎం.ప్రతాప్ తెలిపారు. పరిశ్రమల తనిఖీల్లో సరైన విధానం పాటించకపోవడం వల్లే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నారు. నిపుణులైన కార్మికులను నియమించుకోవడం, ఆధునిక సాంకేతికతను అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చునన్నారు.
Similar News
News March 22, 2026
విశాఖ: మహిళ ఆత్మహత్యాయత్నం

ఆరిలోవలోని గృహిణి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో బంధువులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు వివరాల ప్రకారం.. శ్వేత అనే మహిళ భర్తతో విభేదాల కారణంగా పాతగరువులో ఉంటున్నారు. శనివారం రాత్రి ఆడపడుచు ఉంటున్న ఎస్సైజీనగర్ ఇంటికి శ్వేత వెళ్లగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శ్వేత వెంటనే అదే ఇంట్లో ఓ గదిలోకి వెళ్లి ఉరివేసుకోగా తలుపులు పగలగొట్టి ఆసుపత్రికి తరలించారు.
News March 22, 2026
నీటిని పొదుపుగా వాడండి: జీవీఎంసీ కమిషనర్

వేసవి కాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర వాసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖనగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల (MLD) నీటి అవసరం ఉండగా.. 2047 నాటికి ఇది సుమారు 726 MLDకి పెరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం వేగంగా ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కావున నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నగర పరిపాలనకు సహకరించాలని ఆయన కోరారు.
News March 22, 2026
నీటిని పొదుపుగా వాడండి: జీవీఎంసీ కమిషనర్

వేసవి కాలంలో ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ నగర వాసులకు సూచించారు. ప్రస్తుతం విశాఖనగరానికి రోజుకు సుమారు 400 మిలియన్ లీటర్ల (MLD) నీటి అవసరం ఉండగా.. 2047 నాటికి ఇది సుమారు 726 MLDకి పెరుగుతుందని తెలిపారు. విశాఖపట్నం వేగంగా ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కావున నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నగర పరిపాలనకు సహకరించాలని ఆయన కోరారు.


