News August 25, 2024

సదాశివనగర్: విష జ్వరంతో బాలిక మృతి

image

సదాశివనగర్ మండలం భూంపల్లికి చెందిన మాన్యశ్రీ(12) విష జ్వరంతో శనివారం మృతి చెందినట్లు మండల ప్రాథమిక కేంద్రం వైద్యురాలు అస్మా తెలిపారు. బాలిక రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడటంతో కామారెడ్డికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. గ్రామంలో వరుసగా ఇద్దరు విషజ్వరాలతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తుందన్నారు.

Similar News

News April 2, 2026

నిజామాబాద్: విజయవంతమైన గ్రామ, వార్డు సభలు

image

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామపంచాయతీలు,146 వార్డుల్లో నిర్వహించిన గ్రామ, వార్డు సభలు విజయవంతమయ్యాయి. కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో నిర్వహించిన ఈ సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విస్తృతంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేసి, అవసరమైన సౌకర్యాలు కల్పించారు.

News April 2, 2026

NZB: గ్రామ సభలో CM ఫోటో లేదు

image

సాధారణంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు, గ్రామసభలు జరిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రుల ఫోటోలు ఉండటం ప్రొటోకాల్‌లో భాగం. అయితే గురువారం నగరంలోని 15వ డివిజన్‌లోని అర్సపల్లిలో నిర్వహించిన గ్రామసభ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేకపోవడంతో పాటు MIM చీఫ్ అసదుద్దీన్ ఫోటో ఉండడంతో అది స్థానిక రాజకీయ వర్గాల్లో, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది.

News April 2, 2026

టీయూలో ప్రేరణ-2026

image

తెలంగాణ కామర్స్ అసోసియేషన్ (TCA), తెలంగాణ యూనివర్సిటీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రేరణ-2026 ఇంటర్ కాలేజియేట్ కామర్స్ ఫెస్ట్’లో భాగంగా వర్సిటీ స్థాయి పోటీలు గురువారం నిర్వహించారు. 200 మందికిపైగా విద్యార్థులు పాల్గొన్నారు. 50 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి, ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.