News August 25, 2024
పెద్దపల్లి: జ్వరంతో యువకుడి మృతి

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో విషాదం నెలకొంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నేరెళ్ల ప్రశాంత్ (26) 10 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి శనివారం తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. కాగా ఏడాది కిందట ప్రశాంత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ప్రశాంత్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News July 7, 2025
కరీంనగర్ జిల్లాలో 59 మంది ఎంపిక

బాసర-IIIT ప్రవేశాల కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 293 మంది విద్యార్థులు తాత్కాలికంగా ఎంపికయ్యారు. ఇందులో సిరిసిల్ల జిల్లా నుంచి అత్యధికంగా -117 మంది ఉన్నారు. జగిత్యాల జిల్లా -66 మంది, కరీంనగర్ జిల్లా – 59 మంది, పెద్దపల్లి జిల్లా – 51 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులకు నేటి నుంచి 9వ తేదీ వరకు బాసర-IIIT లో కౌన్సెలింగ్ జరుగుతుంది.
News July 7, 2025
పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు గుర్తించారు.
News July 7, 2025
నేడు కరీంనగర్లో మంత్రుల పర్యటన

కరీంనగర్లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనలు పర్యటించనున్నారు.
ఉ.9:30 గం.కు పాత ఆర్ట్స్ కళాశాల వద్ద నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
10 గం.లకు అంబేడ్కర్ స్టేడియంలో వన మహోత్సవంలో పాల్గొంటారు.
11గం.కు చేప పిల్లల పెంపకం పరిశీలించి ముదిరాజ్ సంఘాలతో సమావేశమవుతారు.
11:30గంకు క్రీడా పాఠశాల, ఈతకొలను ప్రారంభించి వివిధ క్రీడా సంఘాలతో సమావేశమవుతారు.