News August 25, 2024

ఖమ్మం: శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ అమ్మకాలు

image

శ్రావణమాసం, విష జ్వరాలతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజుకు 2.8 లక్షల కిలోల చికెన్ వినియోగం జరిగేదని, ప్రస్తుతం అది సగానికి పరిమితం అయ్యిందని వ్యాపారస్థులు వాపోయారు. అమ్మకాలు తగ్గడంతో ధరలు పడిపోయాయని అంటున్నారు. కిలో బాయిలర్ చికెన్ ధర రూ.350 నుంచి రూ.170కి, రూ.150 పలికిన లైవ్ ధర రూ.100కి పడిపోయింది.

Similar News

News March 4, 2026

మరణంలోనూ వెలుగులు నింపిన శ్రీవల్లి

image

ఖమ్మం ఎదులాపురం మున్సిపాలిటీకి చెందిన సోమంచి శ్రీవల్లి పుట్టుకతోనే మెదడు సంబంధిత సమస్యతో మంచానికే పరిమితమై, మంగళవారం మృతి చెందింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె తల్లిదండ్రులు చైతన్యవంతంగా ఆలోచించి, కుమార్తె నేత్రాలను ‘అన్నం ఫౌండేషన్’కు దానం చేశారు. శ్రీవల్లి కళ్లతో మరొకరికి చూపునివ్వాలన్న వారి నిర్ణయాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి సురేష్ అభినందించారు. ఈ దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

News March 3, 2026

రెండు గంజాయి కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష

image

ఖమ్మం: రెండు వేర్వేరు గంజాయి కేసుల్లో నిందితుడికి ఒక్కొక్క కేసులో ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె.ఉమాదేవి తీర్పు చెప్పారు. పెనుబల్లి మండలానికి చెందిన వ్యాపారి బోయిన వెంకటరమణ (62) పై 2024, 2025లో వియం బంజర పోలీసుల తనిఖీలలో గంజాయితో పట్టుబడ్డాడు. నిందితుడిపై మోపిన అభియోగం రుజువు కావటంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

News March 3, 2026

వెలుగుమట్ల పార్కును సందర్శించిన డీఎఫ్ఓ

image

ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును జిల్లా అటవీ శాఖాధికారి (డీఎఫ్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ పరిశీలించారు. బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అడవుల రక్షణకు వేగవంతమైన ప్రతిస్పందన చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు.