News August 25, 2024
దర్శి బ్రాంచ్ కెనాల్లో మూడో విద్యార్థి మృతదేహం లభ్యం

దర్శి బ్రాంచ్ కెనాల్లో మూడో విద్యార్థి మృతదేహం లభ్యమైంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి మృతదేహాన్ని కొద్దిసేపటి కిందట గుర్తించారు. మొత్తానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామస్థులు, పోలీసుల సహకారంతో కాలువలో గల్లంతయిన ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం అయ్యాయి. కెనాల్లో ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్ విద్యార్థులు నిన్న గల్లంతు కాగా.. నిన్న ఒకరు, ఇవాళ ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
Similar News
News November 16, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజుల పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.
News November 15, 2025
ప్రకాశం జిల్లాకు 2 రోజులు పాటు మోస్తరు వర్షసూచన

ప్రకాశం జిల్లాకు 2 రోజులపాటు మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రభావం జిల్లాలోని పలు మండలాలపై ఉంటుందన్నారు. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఇటీవల చలి ప్రభావం అధికంగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది.
News November 15, 2025
ప్రకాశం: ‘విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాలి’

వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు సురక్షిత తాగునీరు అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రజలకు కనీస అవసరాలైన తాగునీరు అందించడంలో ఖర్చు చేస్తుందని వివరించారు.


