News August 25, 2024

ఎర్రగుంట్లలో 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

ఎర్రగుంట్లలోని వేంపల్లి రోడ్డులో నివాసముండే విద్యార్థిని చందు(14) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఎర్రగుంట్లకు చెందిన కులాయప్ప కూతురు 2రోజులుగా కడుపునొప్పితో బాధపడుతూ టాబ్లెట్ వేసుకుంది. అయినా నొప్పి తగ్గకపోవడం, ఆసుపత్రికి తీసుకెళ్లలేదన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెప్పారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News March 6, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

image

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.

News March 5, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

image

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.

News March 5, 2026

కడప: ఇంటర్ పరీక్ష.. ఇవాళ ఎంతమంది రాశారంటే.!

image

కడప జిల్లాలో గురువారం 62 కేంద్రాల్లో ఇంటర్ 1st ఇయర్ జువాలజీ, గణితం పరీక్షలు జరిగాయి. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. నేటి పరీక్షలకు 6,561 మందికి గాను.. 6,029 మంది (92%) హాజరయ్యారు. 532 మంది ఆబ్సెంట్ అయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 5,208 మందికి గాను.. 4,834 మంది పరీక్షలు రాశారు. 374 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,353 మందికి గాను.. 1,195 మంది పరీక్షలు రాశారు.