News August 25, 2024

ఉదయగిరి కొండపై మంటలు (PHOTO)

image

ఉదయగిరి పట్టణ శివారులోని దుర్గం కొండపై ఆదివారం రాత్రి మంటలు వచ్చాయి. వన్య ప్రాణులకు ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ కొండకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వన భోజనాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆకతాయిలు ఎవరైనా సిగరెట్ పడేసి ఉంటారని లేదా పొయ్యి వెలిగించి చల్లార్చకపోవడంతో మంటలు వచ్చి ఉంటాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News March 12, 2026

నెల్లూరు: రైల్వే రిక్రూట్ మెంట్ పరీక్షలకు ఉచిత శిక్షణ

image

BC స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో రైల్వే రిక్రూట్ మెంట్ గ్రూప్-D 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అధికారి పి. వెంకట లక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన BC,SC,ST కులాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 23వ తేదీ లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మెరిట్ ఆధారంగా ఎంపిక కాబడిన 100 మంది అభ్యర్థులకు ఈనెల 25వ తేదీ నుంచి ఈ ఉచిత శిక్షణా తరగతులను ఏర్పాటు చేస్తామన్నారు.

News March 12, 2026

గూడూరు ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

image

గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఇవాళ జరుగుతున్న మంత్రి లోకేశ్ పర్యటనకు ఎమ్మెల్యే సునీల్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా లోకేశ్ కాన్వాయ్‌లో వెళ్తున్న సునీల్ కుమార్ కారుకు అల్లూరు మండలం, సున్నపుబట్టి వద్ద త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారందరూ సురక్షితంగా బయట పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 12, 2026

నెల్లూరు జిల్లాకు రూ.110.97 కోట్ల మంజూరు

image

PM కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం నిధులు మంజూరయ్యాయి. నెల్లూరు జిల్లాలోని రైతులకు రూ.110.97 కోట్లు మంజూరైనట్లు వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి తెలిపారు. శుక్రవారం నగదు జమ కానుంది. ఉదయగిరికి రూ.25.74 కోట్లు, ఆత్మకూరుకు రూ.19.59కోట్లు, కావలికి రూ.10.14 కోట్లు, కోవూరుకు రూ.9.30 కోట్లు, సర్వేపల్లికి రూ.15.84, నెల్లూరుకు రూ.2.97కోట్లు, వెంకటగిరికి రూ.9.07కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్లు మంజూరయ్యాయి.