News August 25, 2024

సంగారెడ్డి: ‘కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి’

image

కార్మికుల సంక్షేమానికి సీఐటీయూ కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. సంగారెడ్డిలోని కేబుల్ కిషన్ భవన్ లో తోషిబా పరిశ్రమ కార్మికుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తోషిబా పరిశ్రమలో అవకాశ వాదులను ఓడించాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు రాజయ్య పాల్గొన్నారు.

Similar News

News January 11, 2026

మెదక్: వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇప్పటివరకు 2490 దుప్పట్లను జిల్లా అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు కలెక్టర్‌కు అందజేశారు. దుప్పట్లను 17 బీసీ, ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 1556 మంది విద్యార్థులకు, 6 ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో 932 మంది విద్యార్థులకు అందజేశారు. గొప్పగా స్పందించి, పెద్ద ఎత్తున దుప్పట్లు అందించిన వారికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

News January 11, 2026

MDK: సంక్రాంతి వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.

News January 11, 2026

MDK: సంక్రాంతి వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ

image

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు సూచించారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగలు చోరీలకు పాల్పడే అవకాశమున్నందున నగదు, బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చోరీల నివారణకు ప్రజల సహకారం కీలకమని పేర్కొన్నారు.