News August 26, 2024

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి అధికారం: డీకే అరుణ

image

సభ్యత్వ నమోదులో కార్యకర్తలు క్రియాశీల పాత్ర పోషిస్తే రాబోవు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని MBNR ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో ఇవాళ నిర్వహించిన కార్యశాల సమావేశంలో అరుణ పాల్గొని మాట్లాడారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు అంకితభావంతో నిర్వహించాలని ఎక్కువ మంది యువకులకు పార్టీ సభ్యత్వం ఇప్పించాలని ఆమె పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Similar News

News September 14, 2025

జానంపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలంలోని జానంపేటలో 51.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. బాలానగర్ 50.5, భూత్పూర్ 12.8, మహబూబ్ నగర్ గ్రామీణం 12.3, దేవరకద్ర 11.8, రాజాపూర్ 7.8, నవాబుపేట 6.8, హన్వాడ 6.3, జడ్చర్ల 5.0 మిల్లీ మీటర్లు వర్షం పడింది.

News September 14, 2025

MBNR: జాతీయ లోక్ అదాలత్..2,597 కేసులు పరిష్కారం

image

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో 2,597 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. 15 రోజులుగా పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది కేసుల్లో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసినందువల్ల రాజీ మార్గం అవగాహన కలిగించి, లోక్ అదాలత్ ద్వారా ఇరు వర్గాలకూ ‘మీ ఇంటికే సత్వర న్యాయం’ జరిగిందని, మానిటరింగ్ చేసిన చేసినవారికి త్వరలో రివార్డు అందజేస్తామన్నారు.

News September 14, 2025

MBNR: ఉపాధ్యాయుడి అరెస్ట్.. జైలుకు తరలింపు

image

విద్యార్థిని లైంగికంగా వేధించిన ఓ ఉపాధ్యాయుని పోలీసులు శనివారం అరెస్టు చేసి జైలుకు పంపించారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నీ చదువుకు కావలసిన డబ్బంతా నేను ఖర్చు పెడతానని విద్యార్థినితో పదేపదే అనడంతో.. ఆ విద్యార్థి పేరేంట్స్‌కి చెప్పింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.