News August 26, 2024
నల్గొండ: సర్పంచ్ ఎన్నికలు.. వారొస్తున్నారు

నల్గొండ జిల్లాలో యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.
Similar News
News March 25, 2026
పాత తాలూకా.. నిడమనూరును నియోజకవర్గంగా మార్చాలి

నియోజకవర్గాల పునర్విభజన సెగ ఉమ్మడి నల్గొండలో మొదలైంది. కొత్తగా 6 అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న ప్రచారంతో, పాత తాలూకా కేంద్రమైన నిడమనూరును నూతన నియోజకవర్గంగా ప్రకటించాలని స్థానిక యువత, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరుతో పాటు అడవిదేవులపల్లి, త్రిపురారం, మాడుగులపల్లి మండలాలు.. కొత్తగా ప్రతిపాదిత తుమ్మడం, ఎర్రబెల్లి మండలాలను కలిపి అసెంబ్లీ స్థానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
News March 25, 2026
నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
News March 25, 2026
నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.


