News August 26, 2024
ADB: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక

ముంబాయి-బల్లార్ష మధ్య నడిచే నందిగ్రాం ఎక్స్ప్రెస్ 28, 29 తేదీల్లో ఆదిలాబాద్ వరకే పరిమితం కానుందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. నాగపూర్ డివిజన్లో మరమ్మతుల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది. 28న సీఎస్ ముంబయి నుంచి బయలుదేరే రైలు(నెంబరు 11401) ఆదిలాబాద్లో నిలిపివేయునున్నట్లు పేర్కొంది. 29న నందిగ్రామ్ రైలు(నెంబరు 11402) ఆదిలాబాద్ నుంచి బయలుదేరి ముంబయికి బయలుదేరనుంది.
Similar News
News March 14, 2025
ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఆదిలాబాద్ SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు SP అఖిల్ మహాజన్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూచనలు చేశారు.★ వాహనాలు నడిపే వారిపై రంగులు చల్లుతూ ఇబ్బందులు కలిగించకూడదు★ ఇతరుల అనుమతి లేకుండా రంగులను పూయరాదు★ మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు★ సహజసిద్ధమైన రంగులను ఉపయోగించడం శ్రేయస్కరం★ జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు
News March 14, 2025
ఆదిలాబాద్: వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న కలెక్టర్

విద్యా శాఖ కార్యదర్శి (FLN) విద్యార్థుల్లో అభ్యాస సామర్థ్యాలను బలోపేతం చేసే అంశంపై గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో, విద్యాధికారులతో, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. AI ఆధారిత పరిజ్ఞానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులో వెనుకబడి ఉన్న విద్యార్ధులకు సులువుగా శ్రద్ధతో చదవడానికి పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
News March 14, 2025
ADB: BRAOU సెమిస్టర్-1 హాల్ టికెట్లు విడుదల

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ సెమిస్టర్-1 హాల్ టికెట్లు బుధవారం విడుదల అయ్యాయి. అయితే దీనికి సంబంధించి హాల్ టికెట్లు విద్యార్థులు www.braouonline.in అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యర్థులకు రిజిస్టర్ ఫోన్ నంబర్లకు మేసేజ్లు పంపినట్లు తెలిపారు.