News August 26, 2024
పారా ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్ కోచ్గా విశాఖ వాసి

పారా ఒలింపిక్స్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్ జట్టుకు కోచ్గా విశాఖకు చెందిన మురళీకృష్ణ వ్యవహరించనున్నారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు పలు అంశాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనే బ్యాడ్మింటన్ జట్టుకు మురళీకృష్ణ కోచ్గా సేవలు అందించనున్నారు. కోచ్గా నియమితులైన ఆయనను పలువురు అభినందించారు.
Similar News
News March 15, 2026
విశాఖలో వంకాయలు రూ.28

విశాఖలోని 15 రైతు బజార్లలో ఆదివారం కాయగూరల ధరలు (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. టమాటా రూ.8, ఉల్లిపాయలు రూ.19, కాలీఫ్లవర్ రూ.12, క్యాబేజీ రూ.12, వంకాయలు రూ.28, బెండకాయలు రూ.30, కాకరకాయలు రూ.26, క్యారెట్ రూ.28, గోరుచిక్కుడు రూ.34, బీన్స్ రూ.40, కర్ర పెండ్లం రూ.16, నిమ్మకాయలు రూ.125, గ్రీన్ పీస్ రూ.34గా ఉన్నాయి.
News March 15, 2026
ఏప్రిల్లో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన: ఎమ్మెల్యే గంటా

ఆనందపురం మండలం తర్లువాడలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్కు ఏప్రిల్ మొదటి వారంలో శంకుస్థాపన చేయనున్నట్లు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం కొమ్మాదిలోని ఒక ప్రైవేట్ కాలేజీ రజతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి లోకేశ్ కృషితో విశాఖ ఐటీ హబ్గా మారుతోందని, అమెరికా వెలుపల గూగుల్ సంస్థకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంటుందని గంటా పేర్కొన్నారు.
News March 15, 2026
విశాఖలో చికెన్ రూ.310

విశాఖలోని పలు ప్రాంతాల్లో చికెన్ ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. లైవ్ కేజీ రూ.170, స్కిన్ లెస్ రూ.310, విత్ స్కిన్ రూ.320, శొంఠ్యాం కోడి రూ.340గా కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా మటన్ కేజీ రూ.1000. డజన్ గుడ్లు రూ.60 పలుకుతున్నాయి. చేపలు, రొయ్యల అమ్మకాలు అప్పుఘర్, ఫిషింగ్ హార్బర్, మల్కాపురం, శ్రీహరిపురం, గాజువాక, తదితర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది.


