News August 26, 2024
చెన్నూరు: గుర్తుతెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

కడప జిల్లా చెన్నూరు మండల పరిధిలోని బచ్చుంపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో, వల్లూరు మండలానికి చెందిన బద్వేల్ నజీర్ అనే వ్యక్తి మృతి చెందినట్లు సీఐ పురుషోత్తం రాజు తెలిపారు. సొంత పనుల నిమిత్తం చెన్నూరు వెళ్లిన ఇతడు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో ఇతడు తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News January 12, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు.!

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,290
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,147
* వెండి 10 గ్రాములు ధర రూ.2,620.
News January 12, 2026
కడప: ఒక MRO సస్పెండ్.. మరో 11 మందికి నోటీసులు

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కొరడా ఝులిపించారు. ముఖ్యంగా జిల్లా అతి తక్కువగా పాసు పుస్తకాలను పంపిణీ చేసిన తొండూరు MRO రామచంద్రుడు సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CK దిన్నె MROలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
News January 12, 2026
గండికోట ఉత్సవాల్లో పర్యాటక మంత్రి.. ఏం మాట్లాడారంటే.!

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం గండికోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. గండికోట ఓ వారసత్వ సంపదని మోదీ, CM, DyCm ఇలాంటి కట్టడాల పరిరక్షణకు పెద్దపీట వేశారన్నారు. గండికోట అభివృద్ధికి రూ.78 కోట్ల నిధులు మంజూరయ్యాయని, త్వరలో ఈ ప్రాంతంలో హోటల్స్ వెలుస్తాయన్నారు. ఈ ప్రాంత వసతి, సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. గండికోట ఉత్సవ ఏర్పాట్లు చేసిన కలెక్టర్, SP ఇతర జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు.


