News August 26, 2024

సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున అందజేత

image

TG: రాజీవ్ గాంధీ అభయహస్తం పథకంలో భాగంగా సివిల్స్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందించింది. వారికి సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. సివిల్స్ మెయిన్స్‌కు రాష్ట్రం నుంచి 135 మంది అర్హత సాధించగా, వారందరికీ సింగరేణి సంస్థ ద్వారా ఆర్థికసాయం అందజేశారు.

Similar News

News February 20, 2026

రేపు వేంకటేశ్వరుడి ఆలయాల్లో కూటమి శ్రేణుల పూజలు

image

AP: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఇవాళ మండలికి YCP నేతలు శ్రీవారి ఫొటోలను తేవడంపై కూటమి నేతలు తీవ్రంగా పరిగణించారు. దేవుడికి అపచారం జరిగిందంటూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని జూమ్ కాన్ఫరెన్సులో నిర్ణయించారు. రేపు వేంకటేశ్వరస్వామి దేవాలయాల్లో పూజలతో పాటు సంప్రోక్షణ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అటు మఠాధిపతులు, స్వామీజీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

News February 20, 2026

ట్రంప్ మాకు వద్దు బాబోయ్: భారతీయ అమెరికన్లు

image

ట్రంప్ పాలనపై భారతీయ అమెరికన్లు అసంతృప్తితో ఉన్నట్లు ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్స్ సర్వే (IAAS) వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 71% మంది వ్యతిరేకంగా, 29% మంది సానుకూలంగా ఉన్నట్లు తెలిపింది. ఇమిగ్రేషన్, దేశ ఆర్థిక వ్యవస్థ, ట్రేడ్, టారిఫ్స్ విషయంలో ట్రంప్ పాలసీలను 65% మందికిపైగా వ్యతిరేకించారు. భారతీయులపై విద్వేషం, భారత్‌తో బంధం సడలడం వంటి కారణాలతో అభిప్రాయం మారినట్లు తెలుస్తోంది.

News February 20, 2026

ఒమన్‌ను చిత్తుచేసిన ఆస్ట్రేలియా

image

T20WC గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో ఒమన్‌పై ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 105 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఛేదించింది. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 64*(7 ఫోర్లు, 4 సిక్సులు), హెడ్ 19 బంతుల్లో 32(6 ఫోర్లు) విధ్వంసం సృష్టించారు. ఈ గెలుపుతో గ్రూప్-Bలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటికే ఆ జట్టు సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.