News August 26, 2024
కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు: హరీశ్

కాంగ్రెస్ పాలనలో తాగునీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని MLA హరీశ్రావు అన్నారు. ‘సంగారెడ్డి (D) వట్పల్లి (M) మేడికుందా తండాలో 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక కాలి నడకన వెళ్లి కుంట నుంచి బిందెలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఆ నీళ్లు తాగి విషజ్వరాలు వచ్చి ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులను వేడుకున్నా స్పందించడం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు’ అని హరీశ్రావు Xలో పోస్టు చేశారు.
Similar News
News March 11, 2025
మెదక్: యువకుడి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. నార్సింగ్కు చెందిన యువకుడు స్వామి(38) ఇటీవల భార్య కాపురానికి రాకపోవడంతో మద్యంకు బానిసగా మారారు. సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన స్వామి వల్లూరు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
News March 11, 2025
బాలిక చేయ్యి పట్టుకొని దాడి.. నిందితుడికి జైలు: ఎస్పీ

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి జైలు శిక్ష పడినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2018 జనవరిలో చేగుంట మండలం చిట్టోజిపల్లికి చెందిన చల్మెడ సురేశ్.. ఓ బాలిక చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి, కొట్టి అవమానించాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదు కాగా విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద నిందితుడికి 5 ఏళ్ల జెలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు SP చెప్పారు.
News March 11, 2025
గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్: BRS

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !