News August 27, 2024
సదాశివనగర్లో డెంగ్యూతో ఎవరూ మృతి చెందలేదు: వైద్యాధికారి

సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో డెంగ్యూతో ఎవరూ చనిపోలేదని జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇటీవల రన్విత్ (9), మాన్విశ్రీ (12)లకు తీవ్ర జ్వరం రావడంతో ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. కాగా వారికి మోతాదుకు మించి యాంటీబయోటిక్ మందులు ఇవ్వడంతోనే చనిపోయారని ఆయన స్పష్టం చేశారు. సదాశివనగర్కు చెందిన నరేశ్ షుగర్ సమస్యతో మృతి చెందాడని ఆయన పేర్కొన్నారు.
Similar News
News March 17, 2026
NZB: హనుమాన్ జయంతి వేడుకల అనుమతి ఇవ్వాలి: VHP

ఏప్రిల్ 2న జిల్లాలోని NZB, బోధన్, ఆర్మూర్లలో నిర్వహించే హనుమాన్ జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకులు కోరారు. NZB CP సాయి చైతన్యను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో VHP విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, ప్రాంత గోరక్ష కృషి సంపర్క ప్రముఖ్ దాత్రిక రమేశ్, హిందూవాహిని జిల్లా సంయోజక్ దాసరి సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News March 17, 2026
NZB: అధ్యాపకులను రిలీవ్ చేయకుంటే చర్యలు: DIEO

ఈనెల 18 నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్ మూల్యాంకనం అధ్యాపకులను రిలీవ్ చేయాలని, ఎవరైనా రిలీవ్ చేయని ప్రిన్సిపల్లు, ప్రైవేటు యాజమాన్యాలపై కఠిన చర్యలు ఉంటాయని NZB DIEO రవి కుమార్ హెచ్చరించారు. సంబంధిత కళాశాల లాగిన్లలో మూల్యాంకన విధుల్లో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్టు అధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇంటర్ బోర్డు నిక్షిప్తం చేసిందన్నారు.
News March 17, 2026
TU: సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్పై అవగాహన కరపత్రాల విడుదల

విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అన్నారు. ఈ నెల 25న PIB, సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రిజిస్ట్రార్ యాదగిరి, పలువురు ప్రొఫెసర్లతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.


