News August 27, 2024
వారిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తా: బుద్దా వెంకన్న

తనపై దాడికి ప్రయత్నించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని అనుచరుడు తురక కిషోర్పై ఇవాళ నర్సాపురం ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. గత ప్రభుత్వంలో జగన్, సజ్జల ఒత్తిడితోనే పోలీసులు వారిపై కేసు నమోదు చేయలేదని ఆరోపించారు.
Similar News
News January 11, 2026
కోడి పందేలలో గోదావరి జిల్లాలను తలదన్నేలా.?

సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలు.. కోడి పందేలు అంటేనే గోదావరి జిల్లాలు. అయితే గత కొన్నేళ్లు గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా కృష్ణా జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో కోడి పందేలు వేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. కంకిపాడు మండలం ఈడుపుగల్లు, గన్నవరం మండలం అంబాపురం, గుడ్లవల్లేరు మండలం వేమవరం వద్ద అతిపెద్ద బరులను ఏర్పాటు చేస్తున్నారు.
News January 11, 2026
కృష్ణా జిల్లా ‘రెవెన్యూ’లో ఎన్నికల కోలాహలం!

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ కృష్ణా జిల్లా శాఖ కార్యవర్గ ఎన్నిక రసవత్తరంగా మారింది. అధ్యక్ష పదవితోపాటు ఇతర కార్యవర్గ ఏర్పాటుకు నేడు ఎన్నిక జరగనుంది. అధ్యక్ష పదవికి ఇద్దరు డిప్యూటీ తహశీల్దార్లు పోటీ చేస్తున్నారు. రాజీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఎన్నిక అనివార్యంగా తెలుస్తోంది. మచిలీపట్నంలోని రెవెన్యూ హాలులో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరించి 3.30 గంటలకు ఎన్నిక నిర్వహించనున్నారు.
News January 10, 2026
కృష్ణా జిల్లాలో ఎస్ఐల బదిలీ

ఇటీవల జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త టీమ్ను తయారు చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా భారీగా ఎస్ఐలను బదిలీ చేశారు. మొత్తం 38 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగ వేళ జరిగిన ఈ బదిలీలు జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారాయి.


