News August 27, 2024

గుంటూరు: రేషన్‌కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్

image

సెప్టెంబరు నుంచి రేషను కార్డుదారులకు బియ్యంతో పాటు చక్కెర, పట్టణాల్లో రాగులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాలో మొత్తం 5,99,511 రేషనుకార్డులున్నాయి. సెప్టెంబరులో గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలలో పంపిణీ చేసేందుకు 96 టన్నుల రాగులు గోదాముకు చేరాయి. నిలిపివేసిన చక్కెరను కూడా ఇవ్వనున్నట్లు డీఎస్వో కోమలి వర్మ తెలిపారు.

Similar News

News September 18, 2025

నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.

News September 18, 2025

GNT: సీజనల్ వ్యాధుల సమాచారానికి కంట్రోల్ రూమ్

image

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాదులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని,  ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలని కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014  నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

News September 18, 2025

గుంటూరులో అతిసార కేసులపై కలెక్టర్ సమీక్ష

image

గుంటూరులో డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా వైద్య అధికారులను అప్రమత్తం చేశారు. కేసులపై తక్షణమే నివేదిక సమర్పించాలని, వ్యాధి విస్తరించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు భయపడకుండా అవగాహన కల్పించాలని, ఆసుపత్రుల్లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇంటింటి సర్వే చేసి, పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించారు.