News August 27, 2024

మదనపల్లె ఘటన సీన్ రీకన్‌స్ట్రక్షన్

image

AP: రాష్ట్రంలో సంచలనం రేపిన అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయ దస్త్రాల దగ్ధం కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కమల్, సీఐడీ ఎస్పీ వేణుగోపాల్ పాల్గొన్నారు. పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్ తేజను ప్రశ్నించారు.

Similar News

News February 6, 2026

గుడ్ల రైతులకు గడ్డు కాలం

image

AP: రాష్ట్రంలో గుడ్ల రైతులకు గడ్డు కాలం మొదలైంది. <<18548750>>రెండు నెలల<<>> కిందట 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో ₹695 పలకగా ఇప్పుడు ₹480కి పడిపోయింది. గోదావరి నెక్ గుడ్లకు ప్రధాన మార్కెట్ అయిన కోల్‌కతాలో డిమాండ్ లేదంటూ ట్రేడర్లు ₹437కు బేరం ఆడుతున్నారని రైతులు వాపోతున్నారు. 4 రోజులుగా రవాణా నిలిచిపోవడంతో గుడ్లు పేరుకుపోయి పాడవుతున్నాయంటున్నారు. తమకు ఒక్కో గుడ్డు ఉత్పత్తికి ₹5.50 ఖర్చవుతోందని చెబుతున్నారు.

News February 6, 2026

2,325 ఎస్జీటీ పోస్టులు రద్దు!

image

TG: ప్రభుత్వ స్కూళ్లలో 2,325 సాంక్షన్ ఎస్జీటీ పోస్టుల రద్దుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొత్తగా 2,064 పోస్టుల కోసం పాత సాంక్షన్ పోస్టులను సరెండర్ చేయాలని ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం 261 HM, 1,803 పీఈటీ పోస్టులు అవసరం ఉండగా క్యాడర్‌ను బట్టి ఉన్న పోస్టులను సరెండర్ చేయనున్నారు. వీటిలో అత్యధికంగా నల్గొండలో 407, హైదరాబాద్‌లో 306 ఎస్జీటీ పోస్టులు మిగులుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

News February 6, 2026

ఢిల్లీ క్యాపిటల్స్‌కు హార్ట్ బ్రేక్

image

గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని నానుడి. DCకి ఇది సరిగ్గా సరిపోతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ఫైనల్ చేరిన ఆ జట్టుకు అన్నిసార్లు పరాభవమే ఎదురైంది. నిన్నటి మ్యాచులో బ్యాటర్లు రాణించినా బౌలర్లు తేలిపోవడంతో ప్రత్యర్థి విజేతగా నిలిచింది. దీంతో WPL ట్రోఫీ గెలిచేందుకు ఆ జట్టుకు మరో సీజన్ వరకు ఎదురుచూపులే మిగిలాయి. IPLలోనూ ఇంతవరకు DC టైటిల్ గెలవకపోవడం తెలిసిందే.