News August 27, 2024

భద్రాచలం: 28 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 27 అడుగుల వద్ద ఉన్న నీటి ప్రవాహం మంగళవారం ఉదయం 10 గంటలకు 28 అడుగులకు చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి గోదావరి 30 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి అధికారులు పేర్కొన్నారు.

Similar News

News October 7, 2024

న్యూజిలాండ్‌లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి

image

న్యూజిలాండ్‌ ఆక్లాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.

News October 7, 2024

విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

image

గుండాల మండలంలో విద్యుత్ షాక్‌తో బాలిక మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. వెన్నెలబైలు గ్రామానికి చెందిన కృష్ణారావు, సుమలత దంపతుల కుమార్తె సువర్ణ (12). ఆదివారం సాయంత్రం ఇంట్లో కరెంట్ వైరు తెగి ఐరన్ తలుపులపై పడింది. అది గమనించని సువర్ణ ఇంట్లోకి వెళుతూ తలుపులను తాకింది. దీంతో షాక్‌కు గురై మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News October 7, 2024

అశ్వారావుపేట: కరెన్సీ నోట్లతో మండపం

image

అశ్వారావుపేట మండలం నాయీబ్రహ్మణ సంఘం బజారులోని నాయీబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గామాత మండపాన్ని అందంగా అలంకరించారు. 4వ రోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఏకంగా కొన్ని లక్షల ఫేక్ కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించారు. మండపం మొత్తం కరెన్సీ నోట్లతో కళకళలాడుతోంది.