News August 27, 2024

టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్

image

AP: ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు పలువురు వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటోందని లోకేశ్ విమర్శించారు. ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని హామీ ఇచ్చారు.

Similar News

News September 19, 2025

దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!

image

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.

News September 19, 2025

పండగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన: హరీశ్

image

TG: దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు <<17756948>>సవరించడంపై<<>> BRS నేత హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘పండుగలు వస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ, దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి?’ అని ప్రశ్నించారు.

News September 19, 2025

APPLY: బీటెక్ అర్హతతో 119 ఉద్యోగాలు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్(కాంట్రాక్ట్) పోస్టులకు ఈ నెల 26 వరకు <>అప్లై చేసుకోవచ్చు.<<>> 60% మార్కులతో B.Tech/B.E, M.A, CA, MBA పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 29 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. తొలి ఏడాది ప్రతి నెలా ₹35K, రెండో ఏడాది ₹37,500, మూడో ఏడాది ₹40K, నాలుగో ఏడాది ₹43K జీతం ఉంటుంది.
#ShareIt