News August 27, 2024
నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై చర్యలు: CM రేవంత్

TG: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. పెరుగుతున్న వైరల్ జ్వరాల కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని, రాష్ట్రవ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఫాగింగ్, స్ప్రేయింగ్ చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు గ్రామాలకు వెళ్లి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.
News March 5, 2026
3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.


