News August 27, 2024
‘భైరవకోన వద్ద భక్తులకు కనీస వసతులు కల్పించాలి’

సింహాచలం ఆలయ సమీపంలో భైరవకోన వద్ద భక్తులకు కనీస వసతులు కల్పించాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆలయ ఈవో శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. ఈవో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి భైరవకోన స్థితిగతులు, భక్తుల రద్దీ గురించి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భక్తులకు కల్పించాల్సిన కనీస వసతులపై వారికి సూచనలు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News March 21, 2026
విశాఖ: ల్యాప్టాప్ల దొంగ అరెస్టు

రన్నింగ్ ట్రైన్స్లో ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్.ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో స్టేషన్లో తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కాకినాడకు చెందిన అనంత దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.2 లక్షల విలువైన 4 ల్యాప్టాప్లు, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన చెప్పారు.
News March 21, 2026
24న విశాఖ రానున్న రాష్ట్ర గవర్నర్

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ రానున్నారు. 24వ తేదీ రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని రాత్రికి ఒక హోటల్లో బస చేస్తారు. 25న ఉదయం10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 21, 2026
24న విశాఖ రానున్న రాష్ట్ర గవర్నర్

రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 24న విశాఖ రానున్నారు. 24వ తేదీ రాత్రి 9 గంటలకు విశాఖ చేరుకుని రాత్రికి ఒక హోటల్లో బస చేస్తారు. 25న ఉదయం10 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ కాన్వకేషన్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి విజయవాడ పయనమవుతారు. వీటికి తగ్గట్టు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


