News August 28, 2024
దాని కోసం ఎన్ని జన్మలైనా జైల్లో ఉండేందుకు సిద్ధం: మనీశ్ సిసోడియా

విద్యార్థులకు వసతులు, నాణ్యమైన విద్య కోసం ఎన్ని జన్మలైనా జైల్లో ఉండేందుకు సిద్ధమని ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా అన్నారు. మరికొన్ని రోజుల్లోనే సీఎం కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవుతారని చెప్పారు. మంగోల్పురిలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ఆప్ నేతలపై BJP తప్పుడు కేసులు మోపుతోందని ఆరోపించారు. మరోవైపు కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని కోర్టు SEP 3 వరకు పొడిగించింది.
Similar News
News January 10, 2026
‘అల్మాంట్-కిడ్’ సిరప్పై నిషేధం

బిహార్కు చెందిన ట్రైడస్ రెమెడీస్ కంపెనీ ‘అల్మాంట్-కిడ్’ సిరప్పై TG డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. చిన్నారులకు ఉపయోగించే ఈ సిరప్లో విషపూరితమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వినియోగం ప్రాణాంతకమంటూ ‘స్టాప్ యూజ్’ నోటీసు జారీ చేశారు. ‘ప్రజలు ఈ సిరప్ను వాడటం వెంటనే ఆపేయాలి. మీ దగ్గర ఈ మందు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలి’ అని కోరారు.
News January 10, 2026
మహిళా ఆఫీసర్, మంత్రిపై ఆరోపణలు.. ఖండించిన IAS అసోసియేషన్

TG: మహిళా IASపై ఓ మంత్రి ఆపేక్ష చూపిస్తున్నారంటూ ఓ న్యూస్ ఛానల్ టెలికాస్ట్ చేయడాన్ని TG IAS ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. మహిళా అధికారిపై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడింది. దీనిని మహిళా ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్పై దాడిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. పబ్లిక్గా క్షమాపణలు చెప్పాలని ఆ సంస్థను డిమాండ్ చేసింది. ఇలాంటి దురుద్దేశపూర్వక కంటెంట్ను ప్రసారం చేయొద్దని మీడియా సంస్థలను హెచ్చరించింది.
News January 10, 2026
కన్నవాళ్లే కాటికి పంపుతున్నారు

కొందరు తల్లిదండ్రులు కన్నపేగు బంధాన్ని కాలరాస్తున్నారు. AP కృష్ణా(D)లో 45రోజుల పసికందును ఓ తల్లి నీటిగుంటలో విసిరేసింది. TG నారాయణపేట(D)లో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు యత్నించాడు. తాజాగా రంగారెడ్డిలో ఓ తల్లి 11నెలల కొడుకును విషమిచ్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకుంది. అత్త సూటిపోటి మాటలు, భార్యతో గొడవలు, భర్త వేధింపులు కారణమేదైనా రక్తం పంచుకు పుట్టిన పిల్లలను కిరాతకంగా చంపడం కలవరపెడుతోంది.


