News August 28, 2024

విద్యుత్ ఛార్జీలు పెంచబోం: మంత్రి గొట్టిపాటి

image

AP: గత ప్రభుత్వం తొమ్మిదిసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆరోపించారు. తాము కరెంట్ ఛార్జీలను పెంచబోమని పునరుద్ఘాటించారు. డిస్కంల అప్పులు తగ్గించి వాటి ఆర్థిక స్థితిని మెరుగుపర్చడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.

Similar News

News March 20, 2026

లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ..

image

నాసిక్ (MH) <<19426361>>జ్యోతిషుడు<<>> అశోక్ కారత్ (67) కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ‘మంచి భర్త దొరకాలని 2022లో ఓ యువతి సంప్రదించింది. ఆమెకు ఓ తాయత్తు ఇచ్చి తీయవద్దని చెప్పాడు. పరీక్ష కోసం తీయగా వారంలో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది. దీంతో ఆమెకు నమ్మకం పెరిగింది. ఇదే అదనుగా అశోక్ మత్తుమందు ఇచ్చి రేప్ చేశాడు. లైంగిక వాంఛలు తీర్చకపోతే భర్త చనిపోతాడంటూ 2025 వరకు వేధించాడు’ అని పోలీసులు తెలిపారు.

News March 20, 2026

జొమాటో కస్టమర్లకు షాక్.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

image

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కస్టమర్లకు షాకిచ్చింది. ప్లాట్‌ఫామ్ ఫీజును ఆర్డర్‌పై రూ.2.40 చొప్పున పెంచింది. దీంతో రూ.12.50 నుంచి రూ.14.90కి పెరిగింది. పోటీ కంపెనీ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్‌పై రూ.14.99 చొప్పున వసూలు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిన కారణంగానే ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచినట్లు తెలుస్తోంది. దీనివల్ల డెలివరీ పార్ట్‌నర్లతోపాటు రెస్టారెంట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

News March 20, 2026

కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు.. రిజిస్ట్రేషన్లు షురూ

image

2026-27 విద్యాసంవత్సరానికి గాను కేంద్రీయ విద్యాలయాల్లో(KV) అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలైంది. ఒకటో తరగతితోపాటు బాల్ వాటికల్లో ప్రవేశాలకు <>https://kvsangathan.nic.in<<>>/లోకి వెళ్లి ఏప్రిల్ 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బాల్ వాటికలకు ఏప్రిల్ 8న, ఒకటో తరగతికి 9న తొలి జాబితాను విడుదల చేస్తారు. సీట్ల ఖాళీలను బట్టి 16న రెండో, 21న మూడో లిస్టును ప్రకటిస్తారు.
Share It