News August 28, 2024
గణేశ్ మండపాలు పెట్టేవారికి రూల్స్(1/2)

TG: హైదరాబాద్ పరిధిలో గణేశ్ మండపాల ఏర్పాటుకు పోలీసులు పలు నిబంధనలు విధించారు.
✒ పబ్లిక్ రోడ్లు, కాలిబాట ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటుచేయొద్దు.
✒ భక్తుల రద్దీ, గాలి, వానలను తట్టుకునేలా నిర్మాణం ఉండాలి.
✒ రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు వాడొద్దు. ఇరుగుపొరుగు వారికి, వృద్ధులు/ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి.
✒ లక్కీ డిప్లు, లాటరీలు, బలవంతపు నగదు సేకరణ చేయరాదు.
Similar News
News January 13, 2026
భారత్కు మరో S-400.. వచ్చేది ఎప్పుడంటే?

భారత రక్షణ శక్తి మరింత బలోపేతం కానుంది. రష్యా నుంచి నాలుగో S-400 క్షిపణి వ్యవస్థ ఈ ఏడాది మే నాటికి భారత్కు అందనున్నట్లు నివేదికలు వెల్లడించాయి. 2018లో కుదిరిన రూ.40 వేల కోట్ల ఒప్పందం ప్రకారం మొత్తం 5 వ్యవస్థలు కొనుగోలు చేయగా, ఇప్పటికే 3 భారత్కు చేరాయి. నాలుగోది ఈ ఏడాది మేలో, చివరిది 2027లో డెలివరీ కానుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400లు అద్భుతంగా పని చేసిన విషయం తెలిసిందే.
News January 13, 2026
ఐఫోన్ యూజర్లకు అలర్ట్

ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. ‘జీరో క్లిక్ స్పైవేర్’ దాడులు జరుగుతున్నట్లు తెలిపింది. లింక్ క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 11 నుంచి ఆపై మోడల్స్ ఉపయోగిస్తున్న వారు iOS 26కి వెంటనే అప్డేట్ కావాలని సూచించింది. అదనంగా లాక్డౌన్ మోడ్ ఆన్ చేయడం, ఫోన్ను తరచూ రీబూట్ చేయడం ద్వారా రక్షణ పెరుగుతుందని స్పష్టం చేసింది.
News January 13, 2026
ప్రేక్షకులు లేకుండానే WPL మ్యాచ్లు!

WPLలో భాగంగా జనవరి 14, 15 తేదీల్లో జరిగే మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు తెలుస్తోంది. జనవరి 15న ముంబైలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దీంతో DY పాటిల్ స్టేడియంలో జరిగే DC-UPW, MI-UPW మ్యాచ్లకు సరిపడా భద్రత కల్పించలేమని పోలీసులు BCCIకి తెలియజేశారు. ఈ తేదీలకు సంబంధించిన టికెట్లను అమ్మకానికి పెట్టలేదు. 16న జరిగే మ్యాచ్కు సంబంధించిన టికెట్లు సైతం ప్రస్తుతానికి అందుబాటులో లేవు.


