News August 28, 2024
నల్గొండ: పెన్షన్ రూ.2వేలు ఇస్తూ రూ.2,016 రాస్తున్నారు

ప్రతినెలా రూ.2,016లు. పక్కన సంతకాలు. అసలు ఈ ఫోటో ఏంటని అనుకుంటున్నారా. వృద్ధాప్య పింఛన్ ఇస్తూ ప్రతినెలా రాస్తున్న పుస్తకం ఇది. విషయం ఏంటంటే బుక్లోనేమో రూ.2,016 ఇస్తున్నామని రాస్తున్నారు. కానీ పేద వృద్ధులకు ఇచ్చేది మాత్రం రూ.2 వేలే. ఇది త్రిపురారం మండలంలోని పరిస్థితి. రూ.16 ఇవ్వమని ప్రశ్నిస్తే చిల్లర లేవు అంటూ ప్రతినెలా పేదల సొమ్ము మిగుల్చుకుంటున్నారు. మీ దగ్గర ఎలా ఉంది..?
Similar News
News March 17, 2026
NLG: గ్యాస్ కొరతతో సామాన్యులకు కష్టాలు

నల్గొండ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. ధరల పెరుగుదలతో పాటు సరఫరా లోపం కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. వంటగదుల్లో గ్యాస్ లేక వంట చేయడం కష్టంగా మారింది. జిల్లాలో సుమారు 6 లక్షల వినియోగదారులున్నారు. ఈ నెల 13న బుక్ చేసిన సిలిండర్లు ఇంకా అందలేదు. ఈ పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సరఫరా మెరుగుపరచాలని కోరుతున్నారు.
News March 17, 2026
NLG: మొదటి విడత కంప్లీట్… రెండో విడతకు కసరత్తు

జిల్లాలో వ్యవసాయాన్ని మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వం రెండో విడత యాంత్రీకరణ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాగులో యంత్రాల వాడకాన్ని పెంచి, రైతులకు శ్రమ, పెట్టుబడి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం మరో రూ.4 కోట్ల భారీ నిధులు కేటాయించనున్నది. జిల్లాలో ఇప్పటికే మొదటి విడతలో రూ.4 కోట్ల వ్యయంతో 1,900 మంది రైతులకు ప్రభుత్వం విజయవంతంగా పరికరాలను అందజేసింది.
News March 17, 2026
నల్గొండ: ఊరి శివారులో యువకుడి మృతదేహం

శాలిగౌరారం మండలం కొండారం శివారులో రోడ్డు పక్కన ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఉదయం బావుల వద్దకు వెళ్లిన రైతులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


