News August 28, 2024

VZM: ఈవీఎం రీవెరిఫికేషన్‌కు ఎంత కట్టారంటే?

image

ఈవీఎంల చెకింగ్, రీవెరిఫికేషన్‌కు నిబంధనల ప్రకారం నగదు చెల్లించారని విజయనగరం కలెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. గజపతినగరం నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం నెం.20లో రీవెరిఫికేషన్‌కు బొత్స అప్పల నరసయ్య, నెల్లిమర్ల అసెంబ్లీ సెగ్మెంట్లో నెం.9పోలింగ్ కేంద్రంలో EVM చెకింగ్‌, రీవెరిఫికేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ దరఖాస్తు చేశారు. ఈకమ్రంలో ఇద్దరూ కలిపి రూ.47,200 చెల్లించారని కలెక్టర్ చెప్పారు. 

Similar News

News October 1, 2025

దత్తి: పీ4ను అమలు చేసిన సీఎం.. యువకుడికి రూ.5లక్షల అందజేత

image

దత్తిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు బంగారు కుటుంబాలు, మార్గదర్శిలతో ముఖా ముఖి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ధనుంజయ నాయుడు అనే యువకుడు అనారోగ్య సమస్యతో బాధపడుతూ తన అన్నయ్య పిల్లలకు కూడా తానే దిక్కయ్యానని సీఎంకి వివరించాడు. దీనికి స్పందించిన సీఎం ఆయన ఆరోగ్య ఖర్చుల కోసం రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ ఆ చెక్కును యువకుడికి అందజేశారు.

News October 1, 2025

విజయనగరం ఉత్సవాల గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రులు

image

ఈనెల 5, 6 తేదీల్లో జరగనున్న విజయనగరం ఉత్సవాల గోడ పత్రికను మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. విజయనగర వైభవాన్ని చాటి చెప్పే విధంగా ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News October 1, 2025

VZM: పీ4 కార్యక్రమంపై చంద్రబాబు ఏమన్నారంటే..!

image

పీ4 ద్వారా లక్ష మంది మార్గదర్శకులు 10 లక్షల మంది పేదల్ని వృద్ధిలోకి తెస్తారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దత్తిలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఆయన ప్రశాంగించారు. రాష్ట్రంలో ఆర్ధిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడానికే పీ4 కార్యక్రమం తీసుకువచ్చామన్నారు. ప్రజల బాగోగుల కోసం నిర్దిష్టమైన విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.