News August 28, 2024

RR జిల్లాలో లక్షకు పైగా MSME యూనిట్లు

image

లక్షకు పైగా MSMEలు ఉన్న జిల్లాల్లో రంగారెడ్డి రెండో స్థానంలో ఉంది.ఇక్కడ 1,09,164 యూనిట్లు ఉండగా.. అందులో 87,376 సేవా రంగానికి చెందినవే.మిగిలిన 21,788 ఉత్పత్తి రంగంలో పనిచేస్తు న్నాయి.సూక్ష్మ సంస్థల సంఖ్యనే 1,04,846గా ఉంది. రూ.కోటిలోపు పెట్టుబడి, రూ.5 కోట్లలోపు టర్నోవర్ కల్గిన వాటిని సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు.జూన్ 2024 వరకు ఉన్న వివరాల ప్రకారం చిన్న తరహా 3,866 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News January 13, 2026

RR: వారికి రేషన్ డీలర్ కట్ చేస్తాం: మాచన

image

రంగారెడ్డి జిల్లాలోని కొందరు రేషన్ డీలర్లు సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారని ఇది గొప్ప పరిణామమని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. కానీ సర్పంచ్‌లు అయ్యాక డీలర్‌గా కొనసాగటం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేసిన డీలర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే డీలర్ షిప్ రద్దుకు సిఫారసు చేస్తామన్నారు.

News January 9, 2026

HYD: 2 రోజులు వాటర్ బంద్

image

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.

News January 8, 2026

తలకొండపల్లి: రేపటి నుంచి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

image

తలకొండపల్లి మండలం వెల్జాల్‌లో వెలసిన వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 9 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త శ్రీనివాసమూర్తి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా 9న గణపతి పూజ, లక్ష్మీనరసింహస్వామి అభిషేకం, లక్ష పుష్పార్చన, 10న పుష్పార్చన, అభిషేకం, బండ్లు తిరుగుట, 11న మధ్యాహ్నం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం, చక్రతీర్థం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.