News August 29, 2024
నరసరావుపేట: ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటుపై సమీక్ష

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఇరువురు విచ్చేస్తున్నట్లు ఆయన బుధవారం తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
Similar News
News September 19, 2025
గుంటూరు జిల్లాలో వర్షపాతం వివరాలు

గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజాము నుంచి గురువారం పలు ప్రాంతాల్లో చినుకులు పడ్డాయి. మొత్తం మీద సగటు వర్షపాతం 4.1 మిల్లీమీటర్లుగా నమోదైంది. పెదనందిపాడు మండలం 15.6 మి.మీ.తో అగ్రస్థానంలో ఉండగా, తుళ్లూరులో కేవలం 1.8 మి.మీ. మాత్రమే పడింది. మంగళగిరి 9.8, తాడికొండ 9.6, కాకుమాను 9.4, చేబ్రోలు 9.2, గుంటూరు పశ్చిమ 9.2, తాడేపల్లిలో 8.4 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు కొంత ఊరట పొందారు
News September 19, 2025
సీజనల్ వ్యాధుల పై అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్

సీజనల్ వ్యాధుల సమాచారానికి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా తెలిపారు. ప్రస్తుత వాతావరణ మార్పుల దృష్ట్యా గుంటూరు జిల్లాలో అంటు వ్యాధులు ప్రభలే అవకాశాలు ఉన్నాయని, ప్రజలందరూ అప్రమత్తతతో ఉండాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో 0863- 2234014 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు.
News September 18, 2025
నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.