News August 29, 2024

తిరుమల లడ్డూ మరింత రుచికరం

image

AP: తిరుమల లడ్డూను మరింత రుచికరంగా మార్చేందుకు TTD కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లడ్డూల తయారీకి వాడిన నందిని నెయ్యిని తిరిగి వినియోగించాలని నిర్ణయించింది. ఇందుకు KMF(కర్ణాటక మిల్క్ ఫెడరేషన్)తో ఒప్పందం కుదుర్చుకుంది. కేజీ రూ.470 చొప్పున కొనుగోలు చేయనుంది. యూపీకి చెందిన ఆల్ఫా సంస్థ కూడా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. కాగా లడ్డూ, ఇతర ప్రసాదాల కోసం టీటీడీ రోజుకు 10 వేల కేజీల నెయ్యి వినియోగిస్తోంది.

Similar News

News January 12, 2026

అక్కడ 16 ఏళ్లలోపు వారికి నో SM… మనదగ్గర?

image

16 ఏళ్లలోపు పిల్లలకు DEC 10 నుంచి SMను ఆస్ట్రేలియా నిషేధించడం తెలిసిందే. ఈ ప్లాట్ ఫారాలకు ఆ వయసులోపు వారిని దూరంగా ఉంచాలని లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించింది. దీంతో సోషల్ మీడియా సంస్థలు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే మెటా 5,50,000 ఖాతాలను మూసివేసింది. ఇందులో ఇన్‌స్టాగ్రామ్ నుంచి 3,30,000, ఫేస్‌బుక్ 1,73,000, థ్రెడ్‌‌లో 40,000 ఖాతాలు రద్దయ్యాయి. మన దగ్గర కూడా ఇలా చేయాలని కోరుతున్నారు. మీరేమంటారు?

News January 12, 2026

చర్మాన్ని ఇలా హైడ్రేట్ చెయ్యండి..

image

కాలం ఏదైనా చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపించడానికి తేమ కావాలి. వయసు పైబడటం, ఎండ వేడికి చర్మం పాడవడం వల్ల చర్మ కణాల్లో నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి చర్మానికి హైడ్రేటర్లను అందించాలి. మాయిశ్చరైజర్లతో పోలిస్తే హైడ్రేటర్లు కణాల మధ్య నీటిని పట్టి ఉంచడంలో సాయపడతాయి. గ్లిజరిన్, హ్యాలురోనిక్ ఆసిడ్ వంటివి హైడ్రేటర్లు. వాటిని తప్పక వాడాలి. వీటితో పాటు వారానికి రెండుసార్లు స్క్రబింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి.

News January 12, 2026

కోల్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

కోల్ ఇండియా లిమిటెడ్‌(<>CIL<<>>)లో 125 ఇండస్ట్రీయల్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే(JAN 15) సమయం ఉంది. ఉద్యోగాన్ని బట్టి CA/CMA ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ట వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.22వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.coalindia.in/