News August 29, 2024

వైసీపీకి ఏడుగురు ఎంపీల గుడ్ బై?

image

AP: ఏడుగురు YCP రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, R.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. వీరందరూ రాజీనామా చేస్తే YCPకి మిగిలేది మరో నలుగురు MPలే. ఇవాళ మోపిదేవి, మస్తాన్ రావు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించనున్నారు.

Similar News

News October 29, 2025

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 50 మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, CA/CMA/CS/CFA, ఫైనాన్స్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.850, SC,ST,దివ్యాంగులు రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://bankofbaroda.bank.in/

News October 29, 2025

మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా?

image

మన ఇంట్లో వస్తువుల అమరిక మనపై శుభాశుభ ఫలితాలను చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తి రాకుండా ఉండాలంటే.. వాడని, తుప్పు పట్టిన, ఆగిపోయిన గడియారం వంటి వస్తువులను వెంటనే తీసివేయాలని అంటున్నారు. ‘కిటికీలు, తలుపులపై సెలనైట్ రాళ్లు ఉంచడం శుభం. గ్యాస్ స్టవ్‌ను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. లేదంటే ఆర్థిక సమస్యలు రావొచ్చు. రోజూ అగరబత్తి వెలిగిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది’ అంటున్నారు.

News October 29, 2025

పంట దిగుబడిని పెంచే పచ్చి ఆకు ఎరువు అంటే ఏమిటి?

image

కొన్ని రకాల చెట్ల నుంచి పచ్చి లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలియదున్నడాన్నే పచ్చి ఆకు ఎరువు అంటారు. పొలంలో దుక్కి చేసే రోజే లేత కొమ్మలు, ఆకులను చేనంతా వేసి భూమిలో కలియదున్నాలి. ఇది క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారి మట్టిని సారవంతం చేస్తుంది. ఈ భూమిలో వేసిన పంటలు ఏపుగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. కానుగ, సీతాఫలం, అవిశ, తంగేడు, వేప వంటి మొక్కలను పచ్చి ఆకు ఎరువు కోసం ఎంపిక చేసుకోవచ్చు.