News August 29, 2024

చిత్తూరు: బస్సులో మహిళా దొంగల హల్‌చల్

image

నగలు కాజేసిన ఇద్దరు మహిళలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తిరుపతిలో బెంగుళూరుకు బస్సు ఎక్కిన ఉమాదేవితో బంగారుపాళెం వద్ద బస్సు ఎక్కిన మహిళలు పక్కనే కూర్చుని మాటలు కలిపారు. ఆమె వద్ద ఉన్న నగల సంచి మాట్లాడుతూనే కాజేసి పలమనేరులో దిగిపోయారు. మహిళ పోలీసులను ఆశ్రయించింది. సీఐ నరసింహరాజు బృందం వారిని పట్టుకుని రూ.4.5 లక్షల విలువైన ఆభరణాలు ఉమాదేవికి అప్పగించారు. నిందితులు చిత్తూరు వాసులుగా గుర్తించారు.

Similar News

News January 15, 2026

చిత్తూరు ఎస్పీకి నోటీసులు

image

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.

News January 15, 2026

చిత్తూరు: మీ ఫ్రెండ్స్‌ను కలిశారా..?

image

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్‌ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్‌ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.

News January 15, 2026

చిత్తూరు జిల్లాలో రేపటి నుంచి ఈ-ఆఫీస్

image

చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం నుంచి ఈ-ఆఫీస్ విధానం అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 98 ప్రభుత్వ కార్యాలయాల్లో కాగిత రహిత పాలనకు అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా పారదర్శకంగా జరిగేలా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.