News August 29, 2024

భారీ వరదలు.. మొబైల్ యూజర్లపై కీలక నిర్ణయం

image

గుజరాత్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంట్రాసర్కిల్ రోమింగ్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసింది. దీనిద్వారా రాష్ట్రంలోని మొబైల్ యూజర్లు తమ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవచ్చు. ఆటోమేటిక్ కనెక్షన్ ద్వారా ఎయిర్టెల్, JIO, VI, BSNLలో బెస్ట్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ అవుతుంది. రేపు రాత్రి 12 గంటల వరకు ఇది అందుబాటులో ఉండనుంది.

Similar News

News December 28, 2025

కొత్త ఆశలు, సంకల్పంతో నూతన ఏడాదిలోకి: మోదీ

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాతో ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచమే ఆశ్చర్యపోయిందని PM మోదీ అన్నారు. ‘ఏడాది చివర్లో అయోధ్య రామ మందిరంపై పతాకావిష్కరణతో ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండిపోయింది. ఆపరేషన్ సిందూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ఉత్సాహాన్ని కనబరిచారు. కొత్త ఆశలు, సంకల్పంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేందుకు దేశం సిద్ధం’ అని ‘మన్ కీ బాత్’లో చెప్పారు.

News December 28, 2025

69 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో <>ICDS <<>>69 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ పాసై, 21 నుంచి 35ఏళ్లు ఉన్న స్థానిక మహిళలు ఎల్లుండి(డిసెంబర్ 30) వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అంగన్‌వాడీ వర్కర్, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు జీతం నెలకు రూ.11,500, హెల్పర్‌కు రూ.7వేలు చెల్లిస్తారు. CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://srisathyasai.ap.gov.in/

News December 28, 2025

జియో, NSE, ఓయో.. 2026లో IPOల జాతర

image

2025లో IPOల జోరు తర్వాత 2026లో ఏకంగా రూ.1 లక్ష కోట్ల సందడి మొదలుకానుంది. దలాల్ స్ట్రీట్‌లోకి దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. అందరూ ఎదురుచూస్తున్న జియో, NSE, ఫోన్‌పే IPOలు వచ్చే ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్, జెప్టో, ఓయో, బోట్ వంటి బడా కంపెనీలు కూడా లిస్టింగ్ రేసులో ఉన్నాయి. SBI MF, ఫ్రాక్టల్ అనలిటిక్స్ వంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లను ఊరించనున్నాయి.