News August 29, 2024

విశాఖ కోర్టుకు హాజరైన లోకేశ్

image

AP: ‘సాక్షి’ పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం 12వ అదనపు జిల్లా కోర్టుకు హాజరయ్యారు. గతంలో ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ పేరుతో సాక్షి పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. దీనిపై లోకేశ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ఇవాళ విచారణకు రావడంతో ఆయన కోర్టుకు వెళ్లారు.

Similar News

News January 13, 2026

ఇరాన్ టారిఫ్ బాంబ్.. భారత్‌పై ప్రభావమెంత?

image

ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై <<18842223>>25% టారిఫ్<<>> విధిస్తామని అమెరికా ప్రకటించింది. ఇది భారత్‌కూ వర్తిస్తుంది. ఇప్పటికే రష్యాతో చమురు కొనుగోలు వల్ల US మనపై 50% సుంకాలు బాదుతోంది. తాజాగా ఇరాన్ ఎఫెక్ట్ కూడా పడితే మొత్తంగా అగ్రరాజ్యానికి మనం చేసే ఎగుమతులపై 75% టారిఫ్‌లు కట్టాల్సి వస్తుంది. టెహ్రాన్‌లోని ఎంబసీ లెక్కల ప్రకారం.. భారత్-ఇరాన్ మధ్య $1.68B (దాదాపు రూ.15,150 కోట్లు) బైలేటరల్ ట్రేడ్ కొనసాగుతోంది.

News January 13, 2026

రొయ్యల చెరువులో ఈ మార్పులు కనిపిస్తే..

image

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.

News January 13, 2026

ఊర్లలో.. ఏదైనా ప్లాన్ చేద్దాం.. ట్రెండింగ్ టాపిక్!

image

పండుగకు అంతా వస్తుండటంతో ఊర్లు సందడిగా మారాయి. ఇరుగు-పొరుగు, బంధువులు, ఫ్రెండ్స్ కుశల ప్రశ్నలతో కోలాహలం కన్పిస్తోంది. ఇన్నాళ్లూ.. ఎదుటి వారి నుంచి ‘ఏం చేస్తున్నారు?’ అనే ప్రశ్నలు సాధారణంగా వచ్చేవి. ఈసారి ‘ఇక్కడే ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దామా?’ అని ప్లాన్స్, డిస్కస్ చేస్తున్నట్లు చాలా ఊర్ల నుంచి సమాచారం. మీ సర్కిళ్లోనూ పిచ్చాపాటితో పాటు ఈ చర్చలు జరుగుతున్నాయా? కామెంట్.