News August 29, 2024

ఓటరు జాబితా రూపకల్పనకు పటిష్ట చర్యలు: పార్థసారథి

image

ఓటరు జాబితా రూపకల్పనకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్త పట్నాయక్ పాల్గొన్నారు. గ్రామాలలో 18 సంవత్సరాలకు పైబడిన వారికి ఓటు హక్కు కల్పించాలని అన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

Similar News

News September 30, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలిలా

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ క్రింది విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా చిన్నతండ్రపాడులో 35.4 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్‌లో 33.2 డిగ్రీలు, వనపర్తి జిల్లా గణపూర్‌లో 32.7 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా పద్రాలో 31.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News September 30, 2024

జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్‌ఫ్లో

image

జూరాలకు ఇన్ ఫ్లో తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు వివరించారు. 4 క్రస్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 5 యూనిట్లను కొనసాగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. గేట్ల ద్వారా, ఆవిరిరూపంలో, విద్యుదుత్పత్తి నిమిత్తం, కాల్వలకు ఇలా మొత్తంగా 68,647 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 30, 2024

నల్లమలలో టైగర్ సఫారీ రెడీ

image

నల్లమలలో నేటితో మూడు మాసాల నిషేధం ముగియనుంది. రేపటి నుంచి టైగర్ సఫారీ సేవలను అటవీశాఖ పున:ప్రారంభించనుంది. పర్యాటకులు టైగర్ స్టే నల్లమల పేరుతో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. శ్రీశైలం వెళ్లి వచ్చే పర్యాటకుల కోసం ఆఫ్‌లైన్‌లో పరాహాబాద్ చౌరస్తా నుంచి సఫారీ వాహన సేవలను అందిస్తోంది. ఈ వాహనాల్లో వెళ్తూ అడవి అందాలను, పెద్దపులులు, చిరుతలు, వివిధ రకాల, జంతువులు, పక్షులను ప్రత్యక్షంగా చూడొచ్చు.