News August 29, 2024

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదుల హ‌తం

image

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో జరిగిన 2 ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్‌ కుంక‌డి, కర్నాహ్‌‌లో ఉగ్ర‌వాదుల చొరబాట్ల‌ స‌మాచారంతో భారత సైన్యం, JK పోలీసులు జాయింట్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బుధ‌వారం సాయంత్రం నుంచి గురువారం ఉద‌యం వ‌ర‌కు ఎదురు కాల్పులు కొనసాగాయి. కూంబింగ్‌లో ముగ్గురు ఉగ్రవాదుల మృత‌దేహాలను గుర్తించారు.

Similar News

News November 1, 2025

‘ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్’ అంటే..

image

ఇదొక దీర్ఘకాలిక జీర్ణశయాంతర సమస్య. ఈ సిండ్రోమ్ ఉన్నవారిలో మెదడు, పేగులు కలిసి పనిచేయవు. దీనివల్ల పేగుల్లో సున్నితత్వం పెరుగుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, నిద్రలేమి, ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం, మల పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారిస్తారు. తక్కువ క్వాంటిటీలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం, ఫ్యాట్, ప్రాసెస్డ్, కారంగా ఉండే ఫుడ్స్‌కు దూరంగా ఉంటే ఈ సమస్యను అదుపుచేయవచ్చు.

News November 1, 2025

NFCలో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీ

image

న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) హైదరాబాద్‌లో 405 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి, ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు అర్హులుగా పేర్కొంది. ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది. నెలకు రూ.9,600-10,560 వరకు స్టైఫండ్ చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు <>వెబ్‌సైట్‌ను<<>> సంప్రదించండి.

News November 1, 2025

కొంగ, జింక ఆకారంలో ఎలక్ట్రిక్ పోల్స్.. ఎందుకంటే?

image

స్థానిక కల్చర్, సంస్కృతి, వైల్డ్ లైఫ్‌ను ప్రతిబింబించేలా ఆస్ట్రియాలో ఎలక్ట్రిక్ పోల్స్‌ను ఏర్పాటుచేస్తున్నారు. కొంగలు, దుప్పులు, జింకల ఆకారంలో నిర్మించిన పోల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి ప్రకృతితో మిళితమైన డిజైన్ల వల్ల గ్రిడ్ విస్తరణ ప్రాజెక్టులకు ప్రజల సహకారమూ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రియేటివ్ ఇంజినీరింగ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.