News August 30, 2024

VZM: ‘రోగుల నుంచి డబ్బులు తీసుకుంటే చర్యలు’

image

ఆరోగ్యశ్రీలో చికిత్స పొందిన రోగులు, సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా.. సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో పాటు వైద్యులు, సిబ్బందిపై చర్యలు తప్పవని ఆరోగ్యశ్రీ సమన్వయకర్త అప్పలరాజు హెచ్చరించారు. గురువారం ఆరోగ్యశ్రీ అనుబంధ విభాగం ఆసుపత్రుల యాజమాన్యాలతో నగరంలోని మహారాజ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఉచిత చికిత్స, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు.

Similar News

News October 2, 2025

గోవిందపురం: రేబిస్ లక్షణాలతో మృతి

image

సంతకవిటి మండలం గోవిందపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు (37) రాబిస్ లక్షణాలతో మృతి చెందాడు. లింగంనాయుడికి ఆగస్టు 30న వీధి కుక్క కరిచింది. దీంతో PHCలో మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కాగా.. రాబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందాడు. లింగంనాయుడు కొద్ది రోజుల్లో సింగపూర్ వెళ్లబోతున్న తరుణంలో ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

News October 2, 2025

జిల్లా అధికారులు, ఉద్యోగులు తప్పనిసరిగా హాజరు కావాలి: VZM కలెక్టర్

image

మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా.. ఆ ఇద్దరు మహనీయులకు నివాళి అర్పించే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొనాలని ఆదేశించారు.

News October 2, 2025

వేంకటేశ్వర స్వామి నాకు ప్రాణబిక్ష పెట్టారు: చంద్రబాబు

image

నా పై 24 క్లెమోర్ మైన్స్ పేల్చితే.. సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామే ప్రాణబిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు అన్నారు. దత్తిలో ఆయన మాట్లాడుతూ.. ఆ స్వామి ఆశీస్సులతో రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తానన్నారు. ఆనాడు ఎన్టీఆర్ తిరుమలలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లోనూ అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.