News August 30, 2024
నస్రుల్లాబాద్: మద్యం మత్తులో ఒకరిపై దాడి

ఇద్దరు వ్యక్తులు కలిసి మద్యం మత్తులో ఒకరిపై దాడి చేసిన ఘటన నస్రుల్లాబాద్, వర్ని మండల సరిహద్దులో గురువారం రాత్రి జరిగింది. బాన్సువాడ మండలం కొల్గూరుకు చెందిన ఆంజనేయులును ప్రవీణ్ పని నిమిత్తం వర్నికి తీసుకెళ్లారు. దారిలో ప్రవీణ్, ఆంజనేయులు, వర్నికి చెందిన మరో వ్యక్తి కలిసి మద్యం తాగారు. అనంతరం వీరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆంజనేయులుపై కర్ర, బ్లేడ్తో ప్రవీణ్ మరో వ్యక్తి కలిసి దాడి చేశారు.
Similar News
News January 2, 2026
NZB: ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ సూసైడ్

నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. MHలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు చెందిన ఓంకార్(24) ఖలీల్వాడీలోని సాయి అశ్విని ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 2, 2026
NZB: అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తాం: కవిత

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. మొదటి నుంచి నేను స్వతంత్రంగా పని చేశానని, BRSపై మనసు విరిగిందన్నారు. KCR పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదన్నారు.
News January 2, 2026
నిజామాబాద్: ఏటీఎం దొంగల ముఠా కోసం వేట

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం దొంగల ముఠాల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నిజామాబాద్లో ఇటీవల రెండు ఏటీఎంలు గ్యాస్ కట్టర్తో కాల్చి రూ.36 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. అది జరిగిన రెండో రోజు మళ్లీ నిజామాబాద్, జక్రాన్పల్లిలలో రెండు ఏటీఎంల లూటీకి విఫలయత్నం చేశారు. సీరియస్గా తీసుకున్న సీపీ సాయి చైతన్య ఐదు బృందాలతో మహారాష్ట్ర, హర్యానాలో నిందితుల కోసం వేట సాగిస్తున్నారు.


