News August 30, 2024
మాజీ మంత్రి బాలినేనిపై సీఎంకు ఫిర్యాదు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్. రియాజ్ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. గురువారం అమరావతిలో సీఎంను కలిసిన రియాజ్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
Similar News
News March 10, 2025
ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News March 10, 2025
ప్రకాశం: కొరియర్ల పేరుతో భారీ స్కాములు

ప్రకాశం జిల్లాలో సైబర్ నేరగాళ్లు కొత్తరకం స్కాములకు పాల్పడుతున్నారు. తాజాగా గిద్దలూరులో కొందరికి సైబర్ నేరగాళ్లు స్పీడ్ పోస్ట్లో లక్కీ డ్రా గెలుచారని పోస్టు పంపించారు. కొరియర్ తెరిచి చూడగా లక్కీ డ్రాలో రూ.14,49,000 గెలుచుకున్నారని, ఈ డబ్బు అకౌంట్లో బదిలీ చేయాలంటే రూ.15వేల అమౌంట్ బదిలీ చేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఇలాంటి వాటిపై స్పందించి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని అధికారులు సూచిస్తున్నారు.
News March 10, 2025
పోర్టు పనుల్లో కందుకూరు MLA దందా..?

కందుకూరు టీడీపీ MLA ఇంటూరి నాగేశ్వర రావుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ‘రామాయపట్నం పోర్టు పనుల్లో వాటా కావాలని MLA కోరగా కాంట్రాక్టర్ ఇవ్వలేదు. పోర్టు పనులకు కంకర, ఇసుక తీసుకెళ్లే ప్రతి లారీకి వెయ్యి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుళ్లతో ఆ వాహనాలపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. ఈ వ్యవహారం సీఎం ఆఫీసుకు చేరినా ఎమ్మెల్యే దందా ఆపడం లేదు’ అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొంది.