News August 30, 2024
పెండింగ్ కేసులు: హైకోర్టుల్లో 59 లక్షలు, ట్రయల్ కోర్టుల్లో 4.5 కోట్లు

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో పెండింగ్ కేసులు గతంలో ఎన్నడూ చూడని స్థాయికి పెరిగాయి. 2014లో 41 లక్షలుగా ఉన్న ఇవి 2023లో ఏకంగా 61 లక్షలకు చేరాయి. అయితే ఈ ఏడాది కాస్త తగ్గి 59 లక్షలకు దిగొచ్చాయి. గత దశాబ్ద కాలంలో కేసులు తగ్గింది ఈ ఒక్కసారే. ఇక ట్రయల్ కోర్టుల సంగతి చెప్పనలవి కాదు. 2014లో 2.6 కోట్లున్న పెండింగ్ కేసులు ఇప్పుడు 4.5 కోట్లకు ఎగబాకాయి. విచారించే కొద్దీ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి.
Similar News
News November 2, 2025
క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
News November 2, 2025
కరువు మండలాల జాబితా విడుదల

AP: 2025 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.
News November 2, 2025
నవంబర్ 2: చరిత్రలో ఈరోజు

✒ 1865: సాహితీవేత్త పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
✒ 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
✒ 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్(ఫొటోలో) జననం
✒ 1995: హీరోయిన్ నివేదా థామస్ జననం
✒ 2000: ISSలో ఆస్ట్రోనాట్స్ నివాసం మొదలు
✒ 2012: కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణం
✒ 2015: నటుడు కొండవలస లక్ష్మణరావు మరణం


