News August 30, 2024
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు భారీగా పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్నీ నిండి… క్యూ లైన్ టీబీసీ వరకు వెళ్లింది. సర్వదర్శనం కోసం సుమారు 18గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ఇక నిన్న స్వామివారిని 62, 569 మంది దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం 4.15 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News January 2, 2026
నెల్లూరు: మీకు పాస్ బుక్ వచ్చిందా..?

నెల్లూరు జిల్లాలో ఈనెల 9వ తేదీ వరకు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో రీసర్వే చేశారు. భూ వివాదాలను పరిష్కరించి కొత్తగా పాస్ పుస్తకాలు ముద్రించారు. రాజముద్రతో ఉన్న వీటిని గ్రామ సభలు నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా రైతులకు అందజేస్తున్నారు. జిల్లాకు మొత్తం 1.05 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలు చేరాయి. ఈ కొత్త పుస్తకాలు మీకు అంది ఉంటే కామెంట్ చేయండి.
News January 2, 2026
నెల్లూరు కలెక్టర్ సరికొత్త ఐడియా..!

<<18602332>>ఛాంపియన్ ఫార్మర్స్<<>> పేరిట నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు కిసాన్ సెల్ ఏర్పాటు చేశారు. శాస్త్రవేత్తలతో రైతులు నేరుగా <<18725510>>మాట్లాడే <<>>వీలు కల్పించారు. చేపలు, రొయ్యలు, ఆక్వా సాగు సందేహాలపై మత్స్యశాఖ శాస్త్రవేత్త N.తీరజ(9866210891)కు ఉద్యాన పంటలు, విత్తనాల ఎంపికపై ఉద్యానవన శాఖ అధికారిణి లక్ష్మికి(7995088181) కాల్ చేయవచ్చు.
News January 2, 2026
ఉదయగిరి: మళ్లీ పులి వచ్చింది..!

ఉదయగిరి మండలం కొండకింద గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డు, దుర్గం, జి.చెరువుపల్లి అటవీ ప్రాంతాల్లో తిరగడాన్ని తాము చూశామని నాలుగైదు రోజులుగా ప్రజలు చెబుతున్నారు. తాజాగా గురువారం రాత్రి 7గంటల సమయంలో కుర్రపల్లి-కృష్ణాపురం మార్గంలో జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటడాన్ని కృష్ణారెడ్డిపల్లికి చెందిన దేవసాని శ్రీనివాస్ రెడ్డి చూశారు.


