News August 30, 2024
2026 మార్చి నాటికి దేవాదుల పూర్తి: ఉత్తమ్

TG: ఉమ్మడి వరంగల్ జిల్లాకు కీలకమైన దేవాదుల ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ‘ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది మా లక్ష్యం. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నాశనం చేసింది. దేవాదుల నుంచి 300 రోజులు 60 టీఎంసీలు ఎత్తిపోశాం. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’ అని ఆయన చెప్పారు.
Similar News
News January 8, 2026
జగన్ రాజధాని కామెంట్లపై మంత్రి కౌంటర్

AP: రాజధాని అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. కేంద్రం, ఆర్థిక సంస్థలకు తెలియని విషయాలు తెలుసా అని నిలదీశారు. ‘అమరావతిపై తప్పుగా అర్థం చేసుకున్నామని అధికారం కోల్పోయాక జగన్ అన్నారు. ఇప్పుడు CM ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటున్నారు. నదీ గర్భంలో ఉందంటున్నారు. జగన్ హయాంలోనే రూ.12,700కోట్లు ట్రూఅప్ ఛార్జీలు వేయాలని డిస్కమ్లు ప్రతిపాదించాయి’ అని పార్ధసారథి చెప్పారు.
News January 8, 2026
ఇతిహాసాలు క్విజ్ – 121 సమాధానం

ఈరోజు ప్రశ్న: ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు కావడానికి గల కారణం ఏంటి?
సమాధానం: హస్తినాపుర వంశాభివృద్ధి కోసం వ్యాసమహర్షి అంబిక వద్దకు వెళ్లారు. ఆయన తపశ్శక్తితో కూడిన భయంకర రూపాన్ని చూసి అంబిక భయంతో కళ్లు మూసుకుంది. తల్లి చేసిన ఆ చిన్న పొరపాటు వల్ల, ఆమెకు పుట్టిన కుమారుడు ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే అంధుడయ్యాడు. ఆమె కళ్లు మూసుకోవడమే అతడి దృష్టిలోపానికి ప్రధాన కారణమైంది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 8, 2026
ప్రసారభారతిలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

<


