News August 30, 2024
బదులేది మోదీ: ప్రధానికి మమత మరో లేఖ

అత్యాచారాలు, హత్యలకు పాల్పడేవారికి మరణ దండన విధించేలా కేంద్ర చట్టాలను సవరించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె మళ్లీ లేఖ రాశారు. కొన్ని రోజుల కిందట రాసిన లేఖకు ఆయన నుంచి జవాబు రాలేదన్నారు. WCD మినిస్ట్రీ బదులిచ్చిన తీరూ సాధారణంగా ఉందని, తాము లేవనెత్తిన అంశాన్ని సీరియస్గా తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో 88 ఫాస్ట్ట్రాక్, 62 పోక్సో కోర్టులు ఉన్నాయన్నారు.
Similar News
News November 5, 2025
GET READY: మరికాసేపట్లో..

మరికొన్ని నిమిషాల్లో ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా సా.6.49 గంటలకు చంద్రుడు భూమికి అతి సమీపంగా వచ్చి కనువిందు చేయనున్నాడు. సాధారణ రోజులతో పోలిస్తే భూమికి దగ్గరగా చంద్రుడు రావడంతో 14% పెద్దగా, 30% అధిక కాంతితో దర్శనమిస్తాడు. దీన్ని బీవర్ సూపర్ మూన్గా పిలుస్తారు. ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృశ్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉండండి.
News November 5, 2025
ఓటేసేందుకు వెళ్తున్న బిహారీలు.. ఆగిన నిర్మాణ పనులు

దేశంలోని చాలా ప్రాంతాల్లో నిర్మాణం, హోటల్స్ సహా అనేక రంగాల్లో లక్షలాది మంది బిహార్ వలస కార్మికులు పనిచేస్తున్నారు. ఈనెల 6, 11 తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వారంతా స్వస్థలాలకు వెళ్తున్నారు. దీంతో ఆయా రంగాలపై ప్రభావం పడుతోంది. దాదాపు 8 లక్షల మంది బిహార్ కార్మికులు హైదరాబాద్లో ఉంటున్నట్లు అంచనా. వీరంతా వచ్చే వరకు 10 రోజులు పనులకు ఇబ్బంది తప్పదని నిర్మాణ పరిశ్రమ తెలిపింది.
News November 5, 2025
ఇతిహాసాలు క్విజ్ – 57 సమాధానాలు

1. శబరి రాముడి కోసం ‘మాతంగి రుషి’ ఆశ్రమంలో ఎదురు చూసింది.
2. విశ్వామిత్రుడి శిష్యులలో శతానందుడు ‘గౌతముడి’ పుత్రుడు.
3. కుబేరుడు రాజధాని నగరం పేరు ‘అలక’.
4. నారదుడు ‘వీణ’ వాయిద్యంతో ప్రసిద్ధి చెందాడు.
5. కాలానికి అధిపతి ‘యముడు’. కొన్ని సందర్భాల్లో కాళిదేవి, కాళుడు అని కూడా చెబుతారు.
<<-se>>#Ithihasaluquiz<<>>


