News August 30, 2024
వరంగల్ మార్కెట్కు కొత్త పత్తి రాక
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కు ఈరోజు కొత్త పత్తి తరలివచ్చింది. ప్రతి సంవత్సరం దసరా, దీపావళి అనంతరం వచ్చే ఈ పత్తి ఈసారి నెల ముందుగానే మార్కెట్కు వచ్చింది. అయితే రైతులు ఆశించిన విధంగానే ధర వచ్చింది. ఈ క్రమంలో క్వింటా కొత్త పత్తి ధర రూ.7011 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. రేపటి నుంచి మార్కెట్కి వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి.
Similar News
News September 29, 2024
పాలకుర్తి: ఇళ్లు ఖాళీ చేయించడం దారుణం!
పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధితులతో కలిసి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడానికి స్థలం లేకపోవడంతో తన సొంత ఖర్చులతో 20 గ్రామాల్లో భూమి కొనుగోలు చేసి నిరేపేదలకు అందించామన్నారు.
News September 29, 2024
సంతాపం ప్రకటించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు
రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి మరణం పట్ల ఉమ్మడి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క సంతాపం వ్యక్తం చేశారు. ఒక గొప్ప రాజకీయ నాయకునిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీర్చిదిద్దిన వారు ధన్యులని మంత్రులు అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని మంత్రులు చెప్పారు.
News September 29, 2024
వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత: మంత్రి సీతక్క
వృద్ధులు మనకు భారం కాదు.. బాధ్యత అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వృద్ధులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీతక్క పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.