News August 31, 2024

విషాదం.. రెండు నెలల్లో 150 మంది మృతి

image

హిమచల్ ప్రదేశ్‌లో వర్షానికి సంబంధించిన ఘటనల్లో జూన్ 27 నుంచి ఇప్పటివరకు 150 మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో రూ.1,265 కోట్ల నష్టం వాటినట్లు వెల్లడించారు. అనేక చోట్ల ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు ఇంకా రాష్ట్రానికి వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Similar News

News February 1, 2025

దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!

image

TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్‌తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్‌కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

News February 1, 2025

Stock Markets: బడ్జెట్‌కు ముందు మార్కెట్లు అప్

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 25,555 (+50), సెన్సెక్స్ 77,695 (+210) వద్ద ట్రేడవుతున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లకు డిమాండ్ కనిపిస్తోంది. ఐటీసీ హోటల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బీఈఎల్, అల్ట్రాటెక్ సెమ్ టాప్ గెయినర్స్. హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, గ్రాసిమ్, ట్రెండ్ టాప్ లూజర్స్.

News February 1, 2025

బంగారం @ All Time High

image

బంగారం భగభగమంటోంది. మునుపెన్నడూ చూడని విధంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తొలిసారి ఔన్స్ విలువ $2817 వద్ద All Time Highని టచ్ చేసింది. ప్రస్తుతం $2797 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, US ఫెడ్ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం, డీడాలరైజేషన్, ట్రంప్ టారిఫ్స్‌తో ట్రేడ్‌వార్స్ ఆందోళనే ఇందుకు కారణాలని విశ్లేషకులు చెప్తున్నారు. భారత్‌లో 24K గోల్డ్ 10 గ్రాముల ధర రూ.84,340 వద్ద కొనసాగుతోంది.