News August 31, 2024
విషాదం.. రెండు నెలల్లో 150 మంది మృతి

హిమచల్ ప్రదేశ్లో వర్షానికి సంబంధించిన ఘటనల్లో జూన్ 27 నుంచి ఇప్పటివరకు 150 మరణించినట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో రూ.1,265 కోట్ల నష్టం వాటినట్లు వెల్లడించారు. అనేక చోట్ల ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయని తెలిపింది. మరోవైపు ఇంకా రాష్ట్రానికి వర్షం ముప్పు పొంచి ఉంది. ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, సెప్టెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Similar News
News November 4, 2025
122 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<
News November 4, 2025
మంత్రి అజహరుద్దీన్కు శాఖల కేటాయింపు

TG: ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజహరుద్దీన్కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆయనకు ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ ఎంటర్ప్రైజెస్), మైనారిటీ వెల్ఫేర్ శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆయనకు హోంశాఖ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ శాఖను సీఎం రేవంత్ అజహరుద్దీన్కు ఇవ్వలేదు.
News November 4, 2025
రేపు వరల్డ్ కప్ విజేతలకు PM ఆతిథ్యం

ICC ఉమెన్ వరల్డ్ కప్-2025 కైవసం చేసుకున్న భారత క్రికెటర్ల బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ రేపు(NOV 5న) ఆతిథ్యం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని PMO బీసీసీఐకి పంపింది. ఈరోజు సాయంత్రం హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలో క్రికెటర్లు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆదివారం ఉత్కంఠగా జరిగిన పైనల్లో టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి చిరకాల స్వప్నం వరల్డ్ కప్ను సాధించడం తెలిసిందే.


