News August 31, 2024
MBNR: పరిష్కారానికి నోచుకోని సరిహద్దు సమస్య..!

జిల్లాల మధ్య నెలకొన్న సరిహద్దు సమస్య నేటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల భూ రికార్డుల పరంగా స్పష్టత లోపించడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. MBNR, WNP జిల్లాలలో అటవీ, రెవెన్యూ యూ భూములకు సంబంధించి స్పష్టత లేకపోవడం వల్ల ఈ సమస్య పరిష్కరించాలని ఇటీవల మంత్రివర్గ ఉప సంఘానికి రైతులు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కరించాలని మంత్రులు ఆదేశించారు.
Similar News
News January 26, 2026
మహబూబ్నగర్: పరేడ్ మైదానంలో పతాకావిష్కరణ

మహబూబ్నగర్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. కలెక్టర్ విజయేందిర బోయి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ అమలు స్ఫూర్తితో వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ జానకి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
News January 25, 2026
MBNR: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్

ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్స్, బ్యాంకింగ్, రైల్వే ఉద్యోగాల కోసం 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కరపత్రాలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. గత రెండేళ్లలో ఇక్కడి విద్యార్థులు 94 ఉద్యోగాలు సాధించారని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. డిగ్రీ అర్హత కలిగిన SC, ST, BC అభ్యర్థులు ఈనెల 30లోగా www.tsstudycircle.co.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
News January 24, 2026
మహబూబ్నగర్: విద్యుత్ సమస్యలకు చెక్

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా ట్రాన్స్ఫార్మర్ల సమీపంలో ఉన్న మొక్కలను తొలగిస్తున్నామని ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ భీమా నాయక్ తెలిపారు. తిరుమలాపూర్ సమీపంలో ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగిస్తున్నామన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పలువురు ఎస్ఈకి ఫిర్యాదు చేయగా పనులు చేపట్టామని చెప్పారు.


