News August 31, 2024
ఏలూరు: భారీ వర్షాలు.. ఎంపీ మహేష్ ఆదేశాలు

భారీ వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆదేశించారు. రెవెన్యూశాఖ వారు అన్ని మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశారన్నారు. అత్యవసర సందర్భాలలో ప్రజలకు వైద్య సేవలు అందించాలని, నిత్యవసర వస్తువులు తాగునీరు అందుబాటులో ఉంచారన్నారు. ఏదైనా సమస్య వస్తే ఎంపీ కార్యాలయ 98855 19299 నంబర్లో సంప్రదించాలన్నారు.
Similar News
News March 3, 2026
ఆకివీడు సీఐ జగదీశ్వరరావు సస్పెండ్

ఆకివీడు సీఐ జగదీశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. డెడ్ బాడీ పార్సెల్ నిందితుడు సుధీర్ వర్మపై వచ్చిన ఫిర్యాదులో పోక్సో (POCSO) కేసు నమోదు చేయలేదనే ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉన్నతాధికారులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. కాకా 2024 ఆగస్టులో ఆకివీడు సీఐగా నియమితులయ్యారు.
News March 3, 2026
ప.గో జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో శబ్ద, వాయు కాలుష్య నియంత్రణపై కలెక్టర్ నాగరాణి భీమవరంలో అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు, ఆలయాలు, ఆసుపత్రుల వద్ద బాణాసంచా కాల్చకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలుష్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబ సర్వే, ఈ-కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News March 2, 2026
భీమవరం: పోలీస్ శాఖ పీజీఆర్ఎస్కు 14వ అర్జీలు

భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన ‘పీజీఆర్ఎస్’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి 14 అర్జీలను స్వీకరించారు. వీటిలో కుటుంబ కలహాలు, సైబర్ నేరాలు, భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ప్రధానంగా అందాయి. అర్జీలపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడబోమని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.


