News August 31, 2024
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ

రాబోయే రెండు మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ సూచించారు. సీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. అధికారులు, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటల నీటి ప్రవాహం గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హుస్నాబాద్ నుంచి వరంగల్ రహదారిలో వెళ్లే ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
Similar News
News April 16, 2026
మెదక్: TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీ

షామీర్పేట్లో TUWJ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, ప్రధాన కార్యదర్శి సంతోష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టీజీ శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, రాష్ట్ర, జిల్లాల్లో ఎదురవుతున్న వివిధ వృత్తిపరమైన సమస్యలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
News April 16, 2026
MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.
News April 16, 2026
మెదక్: ఫీజు రాయితీలకు సర్టిఫికెట్లు కీలకం: కలెక్టర్

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.


