News September 1, 2024

గాజాలో ఆగిన కాల్పుల మోతలు

image

గాజాపై దాడులకు ఇజ్రాయెల్ తాత్కాలిక విరామం ఇచ్చింది. గాజాలో పాతికేళ్ల తర్వాత పోలియో కేసు నమోదు కావడంతో WHO టీకా డ్రైవ్ నిర్వహిస్తోంది. 6.50 లక్షల పాలస్తీనా చిన్నారులకు టీకా వేయనున్నారు. నిన్నటి నుంచే చిన్నారులకు వైద్య సిబ్బంది టీకా వేస్తూ కనిపించారు. 3 రోజుల పాటు ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి హమాస్-ఇజ్రాయెల్ కూడా అంగీకరించాయి.

Similar News

News February 1, 2025

APకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది. ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడూ ఉంటాయి. పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదంతో ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధుల కేటాయింపుతో ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తేలింది’ అని పవన్ అన్నారు.

News February 1, 2025

ట్రంప్ ప్రతిపాదన తిరస్కరణ

image

గాజాలోని పాలస్తీనీయులకు పొరుగు దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించాయి. ఈ మేరకు ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, UAE, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్త ప్రకటన చేశాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారడంతో పాటు కనీస సౌకర్యాలు కరవయ్యాయని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ట్రంప్ ఇటీవల ఆయా దేశాలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

News February 1, 2025

అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

image

AP: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20వేలు మే నెలలో అందిస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.